నిరుపేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందనడానికి సిద్దిపేట నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు. నియోజకవర్గంలోని 42మంది లబ్ధిదారులకు 16,48,50రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పట్టణానికి చెందిన 20మందికి రూ.8,67,500, సిద్దిపేట రూరల్ మండలంలో ముగ్గురికి రూ.55వేలు, అర్బన్లో ఐదుగురికి రూ.1,64,500 విలువైన చెక్కులు అందించారు.
చిన్నకోడూర్లో ఏడుగురికి రూ.2,26,500, నంగునూరులో ముగ్గురికి రూ.2లక్షల 5వేలు, నారాయణ రావు పేట మండలాల్లో నలుగురికి రూ.1,29,550 పంపిణి చేశారు. 17మందికి ప్రభుత్వ జీఓ 59కింద రెగ్యులరైజ్ చేసిన ప్రొసీడింగ్స్ కాపీలు అందజేశారు.