తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2019, 2:42 PM IST

ETV Bharat / state

లాఠీఛార్జ్​ల​తో ఉద్యమాలను ఆపలేరు..

హైదరాబాద్​లోని మిలియన్​ మార్చ్​లో నిన్న జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ సిద్దిపేట బస్​ డిపో ఆవరణలో ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలతో దీక్ష చేపట్టారు.  తమ డిమాండ్లను సాధించే వరకూ నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

లాఠీఛార్జ్​ల​తో ఉద్యమాలను ఆపలేరు..

ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరుకుంది. నిన్న మిలియన్ మార్చ్​లో జరిగిన లాఠీచార్జీ ఘటనను నిరసిస్తూ సిద్దిపేట బస్ డిపో ఆవరణలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి దీక్ష చేపట్టారు.


మహిళలని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని... తమ న్యాయమైన డిమాండ్​లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు వెల్లడించారు.

లాఠీఛార్జ్​ల​తో ఉద్యమాలను ఆపలేరు..

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: 12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష

ABOUT THE AUTHOR

...view details