ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు. భాజపా యువమోర్చా నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
దుబ్బాకలో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - blood donation camp by BJYM
ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని.. సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా.. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు.

దుబ్బాకలో రక్తదాన శిబిరం
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు సురేశ్ గౌడ్, సీనియర్ నాయకులు, బీజేవైఎం యువనాయకులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు