సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావు ప్రారంభించారు. దుబ్బాక మున్సిపాలిటీలో భాజపాను గెలిపించాలని కోరారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలు నమోదు చేయించారు.