తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ అర్వింద్​పై దాడిని నిరసిస్తూ హుస్నాబాద్​లో రాస్తారోకో - bjp leaders protest at husnabad

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని అంబేడ్కర్​ చౌరస్తాలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వరంగల్​లో ఆదివారం నిజమాబాద్​ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

bjp leaders protest against attack on mp arvind at husnabad
ఎంపీ అర్వింద్​పై దాడిని నిరసిస్తూ హుస్నాబాద్​లో రాస్తారోకో

By

Published : Jul 13, 2020, 1:39 PM IST

వరంగల్​లో ఆదివారం నిజమాబాద్​ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని అంబేడ్కర్​ చౌరస్తాలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ అర్వింద్​పై తెరాస కార్యకర్తలే దాడి చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోగా పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

ఎంపీ అర్వింద్​పై స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, తెరాస కార్యకర్తలే దాడి చేశారని భాజపా నేతలు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజే 2 లక్షల కేసులు

ABOUT THE AUTHOR

...view details