తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2020, 8:01 PM IST

ETV Bharat / state

దుబ్బాక పోలింగ్​ అబ్జర్వర్​ను కలిసిన భాజపా నేతలు

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్​ అబ్జర్వర్​గా వచ్చిన సరోజ్​కుమార్​ ఠాకూర్​ను భాజపా నేతలు కలిశారు. ఎన్నికల విషయంలో తెరాస వ్యవహరిస్తున్న తీరును భాజపా నాయకుడు జితేంతర్​రెడ్డి ఠాకూర్​కు వివరించారు. విషయంపై సరోజ్​కుమార్​ సానుకూలంగా స్పందించి.. క్షణ్నంగా పరిశీలిస్తామని తెలిపారు.

bjp leaders jitendar reddy met elction polling observer at dubbaka
దుబ్బాక పోలింగ్​ అబ్జర్వర్​ను కలిసిన భాజపా నేతలు

సిద్దిపేట జిల్లా కేంద్రంలో దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్​ అబ్జర్వర్​గా వచ్చిన సరోజ్​కుమార్​ ఠాకూర్​ను భాజపా నేతలు ఇంద్రసేనారెడ్డి, జితేందర్​రెడ్డిలు కలిశారు. దుబ్బాకలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. ఈ నెల 26న రఘునందన్​రావు ఇంటి వద్ద జరిగిన సంఘటనను వివరించామని ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై ఠాకూర్​ సానుకూలంగా స్పందించారని .. ఘటనపై క్షుణ్నంగా పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు.

తెరాస నాయకులు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని.. భయభ్రాంతులకు గురిచేకుండా చూడాలని సరోజ్​కుమార్​కు వివరించారు. సీఎం కేసీఆర్​ తీరు మార్చుకోవాలని.. ఎలా పడితే అలా దుర్భాషలాడకూడదని జితేందర్​రెడ్డి విమర్శించారు. దుబ్బాక ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సరోజ్​కుమార్​ ఠాకూర్​ తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా తన వాట్సాప్​ నెంబర్​ 9445437356కు సమాచారం ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండిఃకేంద్ర బలగాలతో దుబ్బాక ఎన్నికలు నిర్వహించాలి: కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details