తెలంగాణ

telangana

'ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి'

By

Published : Jan 28, 2021, 2:04 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అయోధ్య రామమందిర నిర్మాణ విషయమై పరకాల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

BJP leaders held a rally at Husnabad Ambedkar Chowrasta in Siddipet district to protest against remarks made by MLA Dharma Reddy in Husnabad zone
'ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి'

అయోధ్య రామమందిర నిర్మాణ విషయంలో.. పరకాల ఎమ్మెల్యే ధర్మా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

అనుచిత వ్యాఖ్యలు..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన ఈ ఆందోళనలో రామ మందిర నిర్మాణ నిధి విషయమై ఎమ్మెల్యే.. అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని.. ఖమ్మంలోని భద్రాద్రి రామ మందిరంతో పోలుస్తూ తెరాస ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details