వాహన తనిఖీ పేరుతో భాజపాని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. అర్థరాత్రి వేళ సుమారు 200 మంది పోలీసులతో మంత్రి హరీశ్రావు వాహన తనిఖీ చేయించారని, ఇదంతా కుట్ర పూరిత వ్యవహారమని ఆక్షేపించారు. తెరాస ఎన్ని కుట్రలు పన్నినా దుబ్బాకలో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
'తప్పుడు సమాచారంతో సుమారు 8 గంటల పాటు పోలీసులు తనిఖీ పేరుతో హైడ్రామా చూపించారు. పోలీసులను వివరణ కోరితే సరైన సమాధానం కూడా చెప్పలేదు. మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు ఎన్ని కుట్రలు చేసినా భాజపా ముందుంటుంది.'
రఘునందన్ రావు, దుబ్బాక భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి