సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడవ రాష్ట్ర స్థాయి కరాటే ఓపెన్ పోటీలను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విధ్యార్థులు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చి తమ ప్రతిభను కనబర్చారు.
'ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి' - BANTERU RATHAP REDDY LATEST NEWS
ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరికి కరాటే ఎంతో అవసరమని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి కరాటే ఓపెన్ పోటీల్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.
!['ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి' VANTERU PRATHAP REDDY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6257669-107-6257669-1583061933157.jpg)
'ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి'
అంతకు ముందు పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని కల్యాణ మండపంలో ఈ పోటీలను నిర్వహించారు. ఆత్మరక్షణ కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం విద్యార్థులు కరాటే నేర్చుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు జాతీయస్థాయిలో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
'ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి'
ఇవీ చూడండి:పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి