తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల అదుపులో బండి సంజయ్​.. కరీంనగర్​కు తరలింపు - సిద్దిపేటలో పోలీసుల సోదాలపై బండి సంజయ్​ ఆగ్రహం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను సిద్దిపేట శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్దమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగానిది దుందుడుకు చర్యగా విమర్శించారు.

సోదాలు చేయడం ఎన్నికల నియామావళికి విరుద్ధం: బండి సంజయ్​
సోదాలు చేయడం ఎన్నికల నియామావళికి విరుద్ధం: బండి సంజయ్​

By

Published : Oct 26, 2020, 7:15 PM IST

Updated : Oct 26, 2020, 8:46 PM IST

తెలంగాణ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగానిది దుందుడుకు చర్యగా విమర్శించారు.

దాడి జరిగిన కుటుంబసభ్యులను కలవడానికి సిద్దిపేటకు బయలుదేరి వెళుతుండగా సిద్దిపేట శివారులో బండి సంజయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్​కు తరలించారు. ఈ విషయంపై బండి సంజయ్ ఆగ్రహించారు. ఈ విధానాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సిద్దిపేటలో రూ.18.67 లక్షలు స్వాధీనం

Last Updated : Oct 26, 2020, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details