వర్గల్ విద్యా సరస్వతి ఆలయ 29వ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ శంభుని గిరిపై వెలసిన విద్యా సరస్వతి అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు.
భక్తిశ్రద్ధలతో వర్గల్ సరస్వతి ఆలయ వార్షికోత్సవం - వర్గల్ సరస్వతి ఆలయ వార్షికోత్సవం
సిద్దిపేట జిల్లాలోని వర్గల్ సరస్వతి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![భక్తిశ్రద్ధలతో వర్గల్ సరస్వతి ఆలయ వార్షికోత్సవం Anniversary of Wargal Saraswati Temple in siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10772977-1072-10772977-1614250188285.jpg)
భక్తిశ్రద్ధలతో వర్గల్ సరస్వతి ఆలయ వార్షికోత్సవం
అర్చనలు, పూజలతో పాటు ఆలయ ప్రాంగణంలో చండీ హోమం, లలిత పారాయణ కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ శారదా స్మారక వేద విద్యాలయ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు అనంతగిరి శర్మ, శశిధర శర్మ, నాగరాజ శర్మ పాల్గొన్నారు.