సిద్దిపెట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హిమాలయ అమర్నాథ్ సెట్ వేశారు. అక్కడ మంచు లింగాన్ని దర్శనార్థం ఉంచారు. రెండో రోజు ఈ మంచు లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంచు లింగంతో భక్తులు సెల్ఫీలు దిగారు.
సిద్దిపేటలో అమర్నాథ్ క్షేత్రం.. ఆకట్టుకుంటున్న మంచు లింగం - సిద్దిపేటలో మహా శివరాత్రి జాతర
సిద్దిపేటలో హిమాలయ అమర్నాథ్ క్షేత్రం ప్రత్యక్షమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అచ్చుగుద్దినట్టు అలాంటి సెట్టే వేశారు. ఈ క్షేత్రంలోని మంచు లింగాన్ని దర్శించుకోడాని భక్తులు భారీగా తరలివచ్చారు.
సిద్దిపేటలో అమర్నాథ్ క్షేత్రం.. ఆకట్టుకుంటున్న మంచు లింగం
అమర్నాథ్ మంచు లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. హిమాలయ అమర్నాథ్ చూసినట్టుగానే ఉందన్నారు. వచ్చిన భక్తులకు రెండు రుద్రాక్షలను దైవ ప్రసాదంగా అందిస్తున్నారు.
ఇవీ చూడండి:శంభో.. శివ.. శంభో..