తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వర్టును ఢీకొని బైక్​పై వెళ్తున్న యువకుడు మృతి

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు కల్వర్టును ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన హుస్నాబాద్​ మండలం పందిళ్ల గ్రామంలో చోటు చేసుకుంది.

By

Published : Nov 11, 2019, 1:20 PM IST

కల్వర్టును ఢీకొని యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ సమీపంలో తెల్లవారుజామున కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పరువెళ్ళ గ్రామానికి చెందిన రామకృష్ణా రెడ్డి హైదరాబాద్​లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

కేసు విషయమై హుస్నాబాద్​ కోర్టుకు హాజరవడానికి బైక్​ మీద వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కల్వర్టును ఢీకొని యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details