సిద్దిపేట జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుంది. ఒకే రోజు మూడు పాజిటివ్ కే సులు నమోదు అయ్యాయి. దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ నిర్ధారణ అయింది.
తోగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన యువకునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. యువకుడు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అక్కడ డబ్బులు ఎక్కువ అవుతున్నాయని గాంధీ ఆస్పత్రికి వెెెెళ్లగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు చేశారు. పాజిటివ్ రాగా.. యువకుడి స్వగ్రామం గుడికందులకు తరలించి హోమ్ క్వారంటైన్ చేశారు.