రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి కూడలిలో యాదవ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. గొర్రెల కోసం డీడీలు కట్టి ఏడాది దాటినా వితరణలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై గొర్రెలమందతో సంప్రదాయ నిరసన చేశారు.
రెండోవిడత గొర్రెల పంపిణీ చేయాలి: యాదవ సంఘం - సంగారెడ్డిలో యాదవసంఘం రాస్తారోకో
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం నాయకులు రాస్తారోకో చేపట్టారు. గొర్రెలమందతో హైదరాబాద్-ముంబయి రహదారిపై నిరసన చేశారు.
![రెండోవిడత గొర్రెల పంపిణీ చేయాలి: యాదవ సంఘం yadav sangh protest at mumbai hyderabad national highway in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9058994-433-9058994-1601905644036.jpg)
రెండోవిడత గొర్రెల పంపిణీ చేయాలి: యాదవ సంఘం
సీఎం కేసీఆర్ స్పందించి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. యాదవ సంఘం నాయకుల రాస్తారోకోతో హైదరాబాద్-ముంబై మార్గంలో వాహన రాకపోకలు స్తంభించాయి. కోహీర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారి రాస్తారోకో విరమింపజేసి.. రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కేటీఆర్