ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దాదాపు 40 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. మెతుకు సీమ వరప్రదాయిని మంజీర ఎండిపోయి మైదానంగా మారింది. కనీస అవసరాల కోసం ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డిజిల్లాలో 949 ఆవాసాలుండగా వాటిలో 335 ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. 167 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, 191 గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. 725 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని అధికారుల చెబుతున్నా వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
జహీరాబాద్, నారాయణ్ఖేడ్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 250 పైగా గ్రామాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. మంజీర నది పరివాహక ప్రజలు నదిలో చెలిమలు తవ్వి అందులో ఊరిన నీటితోనే గొంతు తడుపుకుంటున్నారు.
రోజంతా పడిగాపులు