తెలంగాణ

telangana

ETV Bharat / state

'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి' - ఓటు వినియోగంపై అవగాహన

మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ వేమన రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

voter_awerness_rali in sangareddy
'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి'

By

Published : Jan 18, 2020, 4:18 PM IST

పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి మున్సిపల్ సిబ్బంది ఓటు హక్కు నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్​ కమిషనర్​ వేమన రెడ్డి అన్నారు.

రాబోయే రోజుల్లో సమర్థమంతమైన పాలనను అందించే వారినే ఎన్నుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన తెలిపారు.

'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి'

ఇవీ చూడండి: కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details