తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం' - vote awareness programm in sangareddy

దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న యువతకు... సరైన నాయకుడి ఎంపిక ఎంత అవసరమో ఈనాడు-ఈటీవీ భారత్ వివరిస్తోంది. సమర్థులను ఎన్నుకొని... ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటూ సదస్సులు నిర్వహించి చైతన్యపరుస్తోంది.

'ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం'
'ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం'

By

Published : Jan 11, 2020, 7:09 PM IST


సంగారెడ్డి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు 'ప్రజాస్వామ్య బలోపేతం- యువత పాత్ర' అనే అంశంపై 'ఈటీవీ భారత్- ఈనాడు' అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని... అభిప్రాయం వెల్లడించారు. ప్రలోభాలకు లొంగకుండా... సరైన నాయకుడిని ఎన్నుకోవాలని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు నీతి నిజాయితీతో గ్రామాభివృద్ధికి కృషి చేసేలా ఉండాలని విద్యార్థులు అన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు, మద్యం పంపిణీ చేసే వారికి.. ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. ఒకసారి ఇచ్చే డబ్బులకు ఐదు సంవత్సరాల కాలాన్ని అమ్ముకోవద్దని కోరారు. డబ్బులు తీసుకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామన్నారు.

కళాశాలలో సదస్సు నిర్వహించినందుకు... ప్రిన్సిపల్ అచ్యుతం 'ఈటీవీ భారత్- ఈనాడు'కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం బలోపేతం యువతతోనే సాధ్యమన్నారు. యువత ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు.

దేశాభివృద్ధి, రక్షణ కోసం యువత ప్రలోభాలకు గురికావద్దని, సమర్థ నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఓటరు చైతన్యంపై మరిన్ని సదస్సులు నిర్వహించి... విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.

'ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం'

ఇదీ చూడండి: 'ఆమెను అత్యాచారం చేసి అంతమొందించాడు'

ABOUT THE AUTHOR

...view details