సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టులో వర్చువల్ లోక్ అదాలత్ వాహనాన్ని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ లోక్అదాలత్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు.
సంగారెడ్డిలో వర్చువల్ లోక్అదాలత్ వాహన ప్రారంభం - సంగారెడ్డి జిల్లా వార్తలు
వర్చువల్ లోక్అదాలత్ వాహనాన్ని సంగారెడ్డి జిల్లా కోర్టులో ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి ప్రారంభించారు. కరోనా కాలంలో పెండింగ్లో ఉన్న కేసులను లోక్అదాలత్లో పరిష్కరించుకోవచ్చునని పాపిరెడ్డి వివరించారు.
![సంగారెడ్డిలో వర్చువల్ లోక్అదాలత్ వాహన ప్రారంభం virtual lok adalath program inaugurated by sangareddy district judge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9464966-95-9464966-1604741950449.jpg)
సంగారెడ్డిలో వర్చువల్ లోక్అదాలత్ వాహన ప్రారంభం
కరోనా సమయంలో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాద్లో ఈ మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు