తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిశ హత్య కేసు నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి' - దిశ హత్యపై స్పందించిన వీహెచ్

ఫాస్ట్​ట్రాక్​ కోర్టులపై నమ్మకం సన్నగిల్లుతోందని... హాజీపూర్​, వరంగల్​ ఘటనలో నిందితులకు నేటికీ శిక్షలు పడలేదని గుర్తుచేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.

Vh on dhisha's murder case
ఫాస్ట్​ట్రాక్​ కోర్టులపై నమ్మకం లేదు

By

Published : Dec 2, 2019, 6:05 PM IST

పశువైద్యురాలు దిశ హత్య కేసు నిందితులను ఎన్​కౌంటర్ చేయడమే సరైన శిక్ష అని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఫాస్ట్​ట్రాక్ కోర్టులపై నమ్మకం సన్నగిల్లుతోందని హాజీపూర్, వరంగల్ ఘటనలో నిందితులకు నేటికీ శిక్షలు పడలేదని గుర్తు చేశారు. నిందితుల తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేశారని తేలితే... ఉరి తీయాలని చెబుతున్న వేళ ఎన్​కౌంటర్ చేయడమే సరైన శిక్షగా అభివర్ణించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఘటనలు జరిగినా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమన్నారు. నేర చట్టాలను మార్చాలని కేటీఆర్ ట్విట్టర్లో స్పందించడం బాధాకరమన్నారు.

ఫాస్ట్​ట్రాక్​ కోర్టులపై నమ్మకం లేదు

ABOUT THE AUTHOR

...view details