పశువైద్యురాలు దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడమే సరైన శిక్ష అని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులపై నమ్మకం సన్నగిల్లుతోందని హాజీపూర్, వరంగల్ ఘటనలో నిందితులకు నేటికీ శిక్షలు పడలేదని గుర్తు చేశారు. నిందితుల తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేశారని తేలితే... ఉరి తీయాలని చెబుతున్న వేళ ఎన్కౌంటర్ చేయడమే సరైన శిక్షగా అభివర్ణించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఘటనలు జరిగినా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమన్నారు. నేర చట్టాలను మార్చాలని కేటీఆర్ ట్విట్టర్లో స్పందించడం బాధాకరమన్నారు.
'దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయాలి' - దిశ హత్యపై స్పందించిన వీహెచ్
ఫాస్ట్ట్రాక్ కోర్టులపై నమ్మకం సన్నగిల్లుతోందని... హాజీపూర్, వరంగల్ ఘటనలో నిందితులకు నేటికీ శిక్షలు పడలేదని గుర్తుచేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.
!['దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయాలి' Vh on dhisha's murder case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5245242-thumbnail-3x2-df.jpg)
ఫాస్ట్ట్రాక్ కోర్టులపై నమ్మకం లేదు