తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరులో వాహనాల దొంగలు అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు లభ్యుల దొంగల ముఠాను పటాన్​చెరు పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Dec 28, 2019, 6:18 AM IST

vehicle thefters arrest in patancheru in sangareddy district
వాహనాల దొంగల అరెస్ట్ చేసిన పటానచెరు పోలీసులు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​కి చెందిన పాత నేరస్తుడు బంటు ప్రసాద్.. నాగార్జున, హరికృష్ణ, మహమ్మద్ అమీర్​తో ముఠాగా ఏర్పడి వాహనాలు చోరీకి పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

వాహనాల దొంగల అరెస్ట్ చేసిన పటానచెరు పోలీసులు

రహదారి కూడలిలో తనిఖీలు

ఈ నెల 27న బాహ్య వలయ రహదారి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని విచారించారు. దొంగతనం చేశామని ఒప్పుకోవడం వల్ల వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'

ABOUT THE AUTHOR

...view details