సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడకు చెందిన గొల్ల అనంతి బుధవారం రాత్రి.. రోజు మాదిరిగానే ఇంటి ఎదుట రెండు ద్విచక్ర వాహనాలు నిలిపాడు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ ట్యాంక్కు నిప్పు పెట్టడం వల్ల మంటలు చెలరేగి రెండు బైకులు కాలిపోయాయి.
ఇంటి ముందు బైకులను అర్ధరాత్రి కాల్చేశారు! - సంగారెడ్డి జిల్లా నేర వార్తలు
గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడం వల్ల ఓ ఇంటి ముందు ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కక్కర్ వాడలో చోటుచేసుకుంది.
గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. దగ్ధమైన రెండు బైక్లు
తనపై గిట్టనివారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితుడు ఝరాసంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా