తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2019, 6:51 PM IST

ETV Bharat / state

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఎమ్మెల్యే మాణిక్ రావు అక్కడ లేకపోవడం వల్ల సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. 38వ రోజు నిరసనలో భాగంగా జహీరాబాద్ బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగించారు. ఐకాస ముట్టడి పిలుపుతో పోలీసులు ముందస్తుగా క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు మూసివేసి కార్మికులను అడ్డుకున్నారు.

పోలీసులు అనుమతితో ఐదుగురు కార్మికులు కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాణిక్​రావు కార్యాలయంలో లేకపోవడం వల్ల సిబ్బందికి వినతి పత్రం అందజేసినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

ఇవీ చూడండి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు అస్వస్థత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details