తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సులను అడ్డుకున్న కార్మికులు.. అరెస్ట్ - tsrtc employees strike 15th day latest

ఆర్టీసీ ఐకాస పిలుపుమేరకు సాగుతున్న బంద్​ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ డిపో నుంచి బస్సులు తీసేందుకు అధికారులు యత్నించగా.. కార్మికులు, వామపక్షాల నేతలు వాటిని అడ్డుకున్నారు.

డిపో నుంచి వస్తున్న బస్సులను అడ్డుకుంటున్న కార్మికులు

By

Published : Oct 19, 2019, 2:27 PM IST

డిపో నుంచి వస్తున్న బస్సులను అడ్డుకుంటున్న కార్మికులు

ఆర్టీసీ జేఏసీ బంద్​ పిలుపుమేరకు హైదరాబాద్​ బీహెచ్ఈఎల్ డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ డిపోలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అక్కడకు చేరుకున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను చూసిన ఆర్టీసీ కార్మికులు బస్సులను బయటకు తీయవద్దంటూ డిపో మేనేజర్​ను అభ్యర్థించారు.

డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన భాజపా, కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. బస్సులను అడ్డుకున్న వారిని, విధ్వంసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. డిపో ముందున్న నాయకులను, ఆర్టీసీ కార్మికులను చందానగర్​ పీఎస్​కు తరలించారు.

ఇదీ చదవండిః రాణిగంజ్​లో వంది మంది కార్మికుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details