తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2019, 8:14 PM IST

ETV Bharat / state

టీఎస్​ఐఐసీ స్థలంలో ఆలయం నిర్మాణం.. అడ్డుకున్న అధికారులు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం గ్రామ శివారులో పారిశ్రామిక అవసరాల కోసం రిజర్వు చేసిన స్థలంలో చేపట్టిన ఆలయ నిర్మాణాన్ని టీఎస్​ఐఐసీ అధికారులు అడ్డుకున్నారు.

tsiic offices stoped temple construction in his lands in sangareddy
టీఎస్​ఐఐసీ స్థలంలో ఆలయం నిర్మాణం..అడ్డుకున్న అధికారులు

పారిశ్రామిక అవసరాల కోసం రిజర్వు చేసిన స్థలంలో చేపట్టిన ఆలయ నిర్మాణాన్ని టీఎస్​ఐఐసీ అధికారులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం గ్రామ శివారులోని టీఎస్​ఐఐసీకి చెందిన స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డితో శంకుస్థాపన చేయించారు. ఇవాళ పునాదులు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న టీఎస్​ఐఐసీ అధికారులు పనులను అడ్డుకున్నారు.

శంకుస్థాపన రోజునే పనులు చేపట్టవద్దంటూ గ్రామపంచాయతీ కార్యవర్గానికి సూచించామన్నారు ఐలా ఛైర్మన్​ చందు పొట్టి. అయినా రాత్రి సమయంలో గుంతలు తవ్వారన్నారు.

గ్రామంలో ఖాళీ స్థలం లేకపోవడం వల్లనే ఆలయం నిర్మాణానికి కొంత భూమిని వినియోగించు కోవాలనుకున్నామని పాశమైలారం ఉపసర్పంచి కృష్ణ యాదవ్ తెలిపారు. అనుమతి కోసం అధికారులకు దరఖాస్తు చేశామన్నారు.

టీఎస్​ఐఐసీ స్థలంలో ఆలయం నిర్మాణం..అడ్డుకున్న అధికారులు

ఇవీచూడండి: ఈనెల 17న వార్డుల పునర్విభజనకు తుది నోటిఫికేషన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details