తెలంగాణ

telangana

ETV Bharat / state

నడి రోడ్డుపై భార్య శవంతో భర్త పడిగాపులు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

ఓ ఆటో డ్రైవర్​ శవాన్ని నడిరోడ్డుపై విడిచి వెళ్లిన అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. మృతిరాలి భర్త గంటన్నర పాటు రోడ్డుపై భార్య శవంతో వేచి చూసి కుటుంబ సభ్యులు వాహనం తీసుకురావటంతో అందులో మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు.

నడి రోడ్డుపై భార్య శవంతో భర్త పడిగాపులు
నడి రోడ్డుపై భార్య శవంతో భర్త పడిగాపులు

By

Published : Jun 12, 2021, 10:35 PM IST

సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. హత్నూర మండలం లాక్మా తండాకు చెందిన మరోని అనే మహిళకు జ్వరం వచ్చింది. వైద్యం కోసం భర్తతో ఆటోలో సంగారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆమె మృతి చెందింది.

దీంతో మృతదేహంతో పాటు ఆమె భర్త పాండు నాయక్​ను ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై దించేసి వెళ్లిపోయాడు. భార్య మృతదేహంతో పాండు నాయక్ గంటన్నరకు పైగా రోడ్డుపైనే రోదిస్తూ పడిగాపులు కాచాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చరవాణితో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వాహనం తీసుకువచ్చి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:సత్తా చాటిన పంత్, గిల్​.. ఇషాంత్​కు 3 వికెట్లు

ABOUT THE AUTHOR

...view details