తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల వేళ... దొంగల హస్తలాఘవం - ఎన్నికల వేళ... దొంగల హస్తలాఘవం

అందరూ ఎన్నికల ఒత్తిడిలో ఉంటే దొంగలు వారి హస్తలాఘవం ప్రదర్శించి పెద్ద ఎత్తున వెండిని దోచుకుపోయారు. పటాన్​చెరులోని ఇస్నాపూర్​లో దుకాణం గోడకు కన్నం కొట్టి 15 లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

పటాన్​చెరులో దొంగల చోరీ

By

Published : Apr 12, 2019, 5:16 AM IST

Updated : Apr 12, 2019, 7:25 AM IST

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​లో చున్నీలాల్ అనే వ్యక్తి శ్రీగణేష్ బంగారం దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గురువారం మార్కెట్​కు సెలవు కావడంతో దుకాణంను తెరవలేదు. అయితే వెనుకవైపున తలుపులు తెరిచి ఉండటం వల్ల స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే యజమానికి సమాచారం అందజేశారు. అతను దుకాణం తెరిచి చూసేసరికి వెనుక గోడకు కన్నం ఉంది. షాపులో దాదాపు 15 లక్షలు విలువ చేసే ఆభరణాలు మాయం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పటాన్​చెరులో చోరీ
Last Updated : Apr 12, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details