తెలంగాణ

telangana

ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక వివాదం.. తీర్పు రిజర్వ్​ చేసిన హైకోర్టు

By

Published : Dec 23, 2022, 9:30 PM IST

బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్​పై విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్​ చేశారు.

హైకోర్టు
హైకోర్టు

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక వివాదంపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్​పై విచారణ ముగిసింది. ఝార్ఖండ్​లో ఓ కేసులో శిక్ష పడిన విషయాన్ని ఎన్నికల అఫిడవిట్​లో ప్రస్తావించలేదని, కేసులను విస్తృతంగా ప్రచారం చేయాలన్న నిబంధననూ పాటించలేదని మదన్ మోహన్​రావు వాదన. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మదన్ మోహన్ రావు హైకోర్టును కోరారు.

ఝార్ఖండ్​లో వేతనాలకు సంబంధించి కేసులో జరిమానా పడిందని.. అది ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని బీబీ పాటిల్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details