రాష్ట్ర ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా వడ్ల వరకుమార్, ఉపాధ్యక్షుడిగా పాండును ఎన్నుకున్నారు. ఎంపీటీసీలకు గ్రామాల్లో విలువ ఇవ్వడం లేదని కుమార్గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంపీటీసీలకు కనీస వేతనం 5000 నుంచి 20,000 వరకు పెంచాలని, గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'ఎంపీటీసీలకు గ్రామాల్లో విలువివ్వడం లేదు' - సంగారెడ్డి జిల్లా తాజా వార్త
సంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను రాష్ట్ర ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు గడీల కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పార్టీలకు అతీతంగా అందరం ఏకమై ఆందోళ చేస్తామని ప్రమాణం చేశారు.
'ఎంపీటీసీలకు గ్రామాల్లో విలువివ్వడం లేదు'
నిధులు, విధులు, అధికారాల సాధనకై మున్ముందు కార్యాచరణ చేపడతామన్నారు. పార్టీల ప్రమేయం లేకుండా అందరూ కార్యాచరణలో భాగం కావాలని కోరారు. ప్రభుత్వం ఎంపీటీసీలకు ప్రోటోకాల్ ఇవ్వాలని.. ఎంపీటీసీ బోర్డును ఏర్పాటు చేసి ఒకరిని క్లర్క్గా నియమించాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే ఉద్యమాలు చేపట్టడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.
ఇదీ చూడండి:12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు.. చట్ట సవరణలు చేసే అవకాశం!
TAGGED:
సంగారెడ్డి జిల్లా తాజా వార్త