తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2021, 12:10 PM IST

ETV Bharat / state

పోతిరెడ్డిపల్లిలో ఘనంగా శివపార్వతుల కల్యాణం

సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.

Sri Ketaki Sangameshwara Swamy Temple celebrated the marriage of Lord Shiva at sangareddy
ఘనంగా శివపార్వతుల కల్యాణం

సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లిలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

శివ పార్వతుల కల్యాణంలో ముత్యాలతో తలంబ్రాలను పోసి కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందించారు.

ఇదీ చదవండి: 'వైకాపా రిగ్గింగ్​ను అడ్డుకున్నాం.. పోలీసుల విధులను కాదు'

ABOUT THE AUTHOR

...view details