తెలంగాణ

telangana

ETV Bharat / state

భిన్న రకాల పరికరాలతో బుల్లి శాస్త్రవేత్తల ప్రదర్శన - SCIENCE FARE IN PATANCHERU'

విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడే వైజ్ఞానిక ప్రదర్శన సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనచ్చు.

భిన్న రకాల పరికరాలతో బుల్లి శాస్త్రవేత్తల ప్రదర్శన

By

Published : Nov 14, 2019, 7:47 PM IST

భిన్న రకాల పరికరాలతో బుల్లి శాస్త్రవేత్తల ప్రదర్శన

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఇందులో జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నమూనాలను తయారు చేసి ప్రదర్శనకు పంపవచ్చు. అయితే వీరి ఇచ్చే ప్రదర్శనలు విజ్ఞాన శాస్త్ర సాంకేతికత ద్వారా సుస్థిర అభివృద్ధి ప్రధానాంశంగా ఉండబోతున్నాయి.

పనిలో నిమగ్నమైన విద్యార్థులు

ఇందులో సుస్థిర వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్యం, శుభ్రత, వనరుల నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్ రవాణా సమాచార రంగం, విద్య, ఆటలు, గణిత మోడలింగ్ వంటి అంశాలలో ఏదైనా నా ఒక అంశాన్ని ఎంచుకుని నమూనాలు తయారు చేయాలని జిల్లా సైన్స్ అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు నమూనాలు తయారు చేసే పనిలో పడ్డారు. కేవలం విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులూ... బోధన ఉపకరణాలను కూడా ప్రదర్శించే అవకాశం కల్పించారు.

భోజనం, వసతి సౌకర్యానికి ఏర్పాట్లు

ఈ సదస్సును నిర్వహించేందుకు ఎంపిక చేసిన పటాన్​చెరు ఉన్నత పాఠశాలను జిల్లా సైన్స్ అధికారి ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 60 గదుల్లో విద్యార్థులు ప్రదర్శన ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక ముందు భాగంలో కూడా కొన్ని ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రదర్శనిలిచ్చేందుకు వచ్చే వారికి భోజనం రాత్రి అక్కడే బస చేసే సౌకర్యాలనూ కల్పిస్తున్నారు.

పిల్లలు బాల శాస్త్రవేత్తలుగా రూపుదిద్దు కొనేందుకు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఇవీ చూడండి: వీలినంపై వెనక్కు తగ్గిన ఆర్టీసీ ఐకాస..!

ABOUT THE AUTHOR

...view details