తెలంగాణ

telangana

ETV Bharat / state

సరస్వతీ అమ్మవారికి... సప్త సమ్మార్చన పూజ - saptha sammarchana puja in sangareddy

అత్యంత విశేషమైన పూజ కైంకర్యాల్లో సప్త సమ్మార్చన ఒకటి. ఈ ప్రక్రియలో రుగ్వేద, యజుర్వేద, సామ, అధర్వణ వేదార్చనతో పాటు.. నృత్యార్చన, వాద్యార్చన, స్తోత్రార్చనలుంటాయి. ఇంతటి విశిష్టమైన క్రతువును సంగారెడ్డికి చెందిన శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం చేపట్టింది. సప్త సమ్మార్చన విధానంలో సరస్వతీ అమ్మవారిని పూజించింది. స్త్రోత్రలహరి పేరుతో స్తోత్రార్చనను కన్నులపండువగా నిర్వహించింది.

సరస్వతీ అమ్మవారికి... సప్త సమ్మార్చన పూజ

By

Published : Nov 10, 2019, 5:25 AM IST

Updated : Nov 10, 2019, 8:01 AM IST

సరస్వతీ అమ్మవారికి... సప్త సమ్మార్చన పూజ

స్తోత్రాలు, సంకీర్తనలతో సంగారెడ్డి పట్టణం మార్మోగింది. పట్టణ శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం చేపట్టిన సప్త సరస్వతీ సమ్మార్చనా మహోత్సవంలో భాగంగా స్తోత్రలహరి నిర్వహించారు. 108 మంది గాయకులు.. 108 సంగీత రాగాల్లో సరస్వతీ మాతను పూజించారు. దేశ నలుమూలల నుంచి వివిధ పీఠాధిపతులు ఈ మహా క్రతువులో భాగస్వాములయ్యారు.

స్తోత్రార్చనలో అమ్మవారిని కొలిచేందుకు అష్టాదశ పురాణాలు, రామాయణ భాగవతం వంటి 320 విశిష్టమైన గ్రంథాల నుంచి 108 ఉత్కృష్ట స్తోత్రాలను సేకరించారు. ఒక్కో స్తోత్ర పఠనం ద్వారా ఒక్కోరకమైన ఫలితం రావడం మరో ప్రత్యేకత. ఈ స్తోత్రాలను 108 మంది గాయకులు.. 108 సంగీత రాగాల్లో ఆలపించారు. కూడలి శృంగేరీ పీఠాధిపతి అభినవ విద్యారణ్య భారతి, మధానానంద సరస్వతి స్వామి వంటి పలువురు పీఠాధిపతులు ఈ క్రతువులో పాల్గొన్నారు.

ఈ పూజలో పాల్గొన్న వేలాది మంది భక్తులు గాయకులతో గొంతు కలిపి.. తన్మయత్వంతో అమ్మవారిని కొలిచారు. ఆర్థిక మంత్రి హరీశ్​ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయం చేయడంలో దైవత్వాన్ని చూడాలని.. ఎంత సంపాదించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. పోయేటప్పుడు ఏం తీసుకెళ్లలేమని మంత్రి హరీశ్​ రావు అన్నారు.స్తోత్రలహరిలో పాల్గోనేందుకు నాలుగు నెలలు తర్ఫీదు పొందామని గాయకులు చెప్పారు.

సప్త సమ్మార్చనలో భాగంగా నేడు 1008 మంది నృత్యకారులు నృత్యాంజలి ద్వారా అమ్మవారిని పూజించనున్నారు.

Last Updated : Nov 10, 2019, 8:01 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details