తెలంగాణ

telangana

సదాశివపేట పట్టణంలో రామ మందిర నిధి సేకరణ

By

Published : Feb 7, 2021, 6:06 PM IST

అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో భాగంగా సంకీర్తన యాత్ర నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sankirtana Yatra organized as part of fund raising for Ayodhya Rama Mandir construction in Sadashivpeth town of Sangareddy district
సదాశివపేట పట్టణంలో.. సంకీర్తన యాత్ర

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో భాగంగా సంకీర్తన యాత్ర నిర్వహించారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం పుర వీధుల నుంచి దుర్గా మాత ఆలయం వరకు ఆటాపాటలతో కోలాటలతో ఈ ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది.

వైభవంగా సాగిన ఈ యాత్రలో..జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ.. కాషాయ జెండాలతో రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తులు పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణానికి తాము ఉడతా భక్తిగా సహాయం చేయటం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఈ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details