స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస తన సత్తా చాటింది. సంగారెడ్డి జిల్లాలోనూ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జోరు కొనసాగించింది. జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ స్థానాలకు గానూ... 20 స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకోగా... 5 జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇటు 295 ఎంపీటీసీ స్థానాలకు గానూ... 177 స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకోగా.... 101 స్థానాలను హస్తం పార్టీ, 2 స్థానాలను భాజపా గెలిచింది. ఇతరులు 15 స్థానాల్లో గెలుపొందారు.
గులాబీ గుబాళించిన సందర్భాన గ్రామగ్రామాన... తెరాస శ్రేణులు గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. ర్యాలీలు, నృత్యాలతో విజయానందం పొందారు.
సంగారెడ్డి జిల్లా | జడ్పీటీసీ | ఎంపీటీసీ |
తెరాస | 20 | 177 |
కాంగ్రెస్ | 05 | 101 |
భాజపా | 00 | 02 |
ఇతరులు | 00 | 15 |
మెుత్తం | 25 | 295 |