తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళల కోసం పింక్​లూ.. పదో తరగతి చిన్నారి ఆవిష్కరణ! - తెలంగాణ వార్తలు

ప్రయాణాల సమయంలో మూత్రశాలలు అందుబాటులో లేక ఆడవాళ్లకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ ఉన్నా అవి కూడా చాలా అపరిశుభ్రంగా ఉంటాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనికి పరిష్కారంగా భూమిక అనే పదో తరగతి విద్యార్థిని పింక్​లూ నమూనా రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

student innovation, Sangareddy district student innovations
పదో తరగతి విద్యార్థి ఆవిష్కరణ, సంగారెడ్డి జిల్లా విద్యార్థి పింక్ లూ

By

Published : Mar 28, 2021, 6:16 PM IST

భూమిక సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్‌సాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. సిద్దేష్ చౌహన్ అనే ఉపాధ్యాయుడి మార్గదర్శనంలో రాష్ట్రస్థాయి సైన్సు పోటీల కోసం పింక్​లూ నమూనాని రూపొందించింది. ఈ నమూనాతో అందరి మన్ననలు అందుకుంటోంది.

మహిళల కోసమే..

పాఠశాలలు, కళాశాలలకు వచ్చే అమ్మాయిలు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో టాయిలెట్‌కు వెళ్లడం కోసం పడే ఇబ్బందే ఈ ఆలోచనకు కారణమని ఆ బాలిక చెబుతోంది. అపరిశుభ్రంగా, అసౌకర్యం తలెత్తకుండా ఉండేందుకు ఈ నమూనాని తయారు చేసినట్లు వివరించింది.

తక్కువ ఖర్చు

రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో అత్యంత తక్కువ ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయొచ్చు అని అంటోంది భూమిక. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఆలోచనగా నిలిచి... జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఈ నమూనా ఎంపికైంది.

పదో తరగతి విద్యార్థి ఆవిష్కరణ, సంగారెడ్డి జిల్లా విద్యార్థి పింక్ లూ

ఇదీ చదవండి:అలరించిన నాటక ప్రదర్శనలు.. కళాకారుల తెర వెనుక కష్టాలు

ABOUT THE AUTHOR

...view details