సంగారెడ్డి జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి. సగటున గతేడాది ఏప్రిల్లో 23.47 మీటర్ల నీటి మట్టం ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్లో 21.85 మీటర్లకు చేరింది. నిరుడి కంటే ఈ ఏడాది ఏప్రిల్లో 1.62 మీటర్ల మేర నీటి మట్టం పెరిగినట్టుగా లెక్కలు చూస్తే తెలుస్తోంది. అమీన్పూర్, అందోలు, హత్నూర, ఝరాసంగం, జిన్నారం, కల్హేర్, కంది, మనూరు, మొగుడంపల్లి, నాగల్గిద్ద, నారాయణఖేడ్, రామచంద్రాపురం, రాయికోడ్, సిర్గాపూర్ ఇలా 14 మండలాల్లో నీటి మట్టం పెరగటం గమనార్హం. ఇది ఊరట కలిగించే అంశమని, ఖరీఫ్ సాగుకు కలిసిరానుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కంగ్టి, కోహీర్, కొండాపూర్, మునిపల్లి, న్యాల్కల్, పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ మండలాల్లో జలాలు పాతాళానికి పడిపోయాయి. తాగు, సాగు బోరుబావులు పని చేయటం లేదు. మరోవైపు గుమ్మడిదల, పుల్కల్, వట్పల్లి, సదాశివపేట నాలుగు మండలాల్లో నీటిమట్టంలో గతేడాది ఏప్రిల్, ఈ ఏడాది ఏప్రిల్కు స్వల్ప తేడా మాత్రమే నమోదయింది.
కంగ్టిలో మరింత లోతుల్లోకి...