తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలు - Sangareddy District Latest News

సంగారెడ్డి జిల్లా కేంద్రం శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఎనిమిదో వార్షికోత్సవాలు ఘనంగా జరిపారు. సుదర్శన యాగం, స్వామి వారికి చక్ర స్నానం నిర్వహించారు. భక్తులు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు కోరుకున్నారు.

Sangareddy District Center Sri Goda Samatha Sri Venkateswara Swamy eighth anniversary celebrated
ఘనంగా గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సుదర్శన యాగం

By

Published : Feb 18, 2021, 6:48 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంటపురంలో గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎనిమిదో వార్షికోత్సవం ఘనంగా జరిపారు. ఉత్సవాల్లో భాగంగా సుదర్శన యాగం, చక్ర స్నాన కార్యక్రమాలు నిర్వహించారు. వైభవంగా జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్వామి వారికి చక్ర స్నానం చేసిన తర్వాత భక్తులు గుండంలో స్నానం చేశారు. శ్రీ వెంకటేశ్వరుడికి వెండి కళాశాల్లో పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు ఆకాంక్షించారు.

దేవుడి ఆశీస్సులు పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు కోరుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం దైవిక కార్యక్రమాలల్లో పాల్గొనాలన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

ఇదీ చూడండి:అజ్మీర్ దర్గాకు చాదర్​ పంపిన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details