దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. పర్యావరణంలో నోబెల్ బహుమతిగా అభివర్ణించే ఈక్వేటర్ అవార్డును సంగారెడ్డి జిల్లా డీడీఎస్ మహిళలు అందుకున్నారు. సేంద్రియ చిరుధాన్యాలు సాగు చేసే మహిళా రైతులు.. పర్యావరణ పరిరక్షణలో చేసిన విశేష కృషిని జిల్లా కలెక్టర్ అభినందించారు.
అసలైన నాగరికత వీరిదే...
నాగరికులమని చెప్పుకునే వారంతా ప్రపంచం ఏటు పోతుందా అని చూస్తూ ఉంటారని.. డీడీఎస్ మహిళా రైతులు ప్రపంచమే తమ వైపు చూసేలా చేశారని సామాజిక సేవకురాలు స్రవంతి అన్నారు. పాత తరానికి చెందిన చిరుధాన్యాలు సాగు చేస్తూ.. భవిష్యత్ తరాల కోసం విత్తనాలు పరిరక్షిస్తున్న ఈ మహిళా రైతులదే అసలైన నాగరికత అని పేర్కొన్నారు.