రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు తెరాసలో చేరుతున్నారని హరీశ్రావు తెలిపారు.
సంక్షేమాన్ని చూసి ఇతరపార్టీల వారు తెరాసలోకి వస్తున్నారు: హరీశ్రావు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
సంగారెడ్డిలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరాసలో చేరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో తెరాస కండువా కప్పుకున్నారు.
![సంక్షేమాన్ని చూసి ఇతరపార్టీల వారు తెరాసలోకి వస్తున్నారు: హరీశ్రావు Congress leaders joining in Trs in the presence of Minister Harish Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7737243-thumbnail-3x2-harish-rk.jpg)
మంత్రి హరీశ్రావు సమక్షంలో తెరాసలో చేరిన హస్తం నేతలు
సంగారెడ్డిలో 400 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు కండువాలు కప్పి మంత్రి తెరాసలోకి ఆహ్వానించారు. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని హరీశ్రావు సూచించారు.
ఇదీ చూడండి :జగన్నాథ రథయాత్ర చరిత్రలో తొలిసారి ఇలా...