తెలంగాణ

telangana

By

Published : Oct 11, 2020, 1:08 PM IST

ETV Bharat / state

ఆస్తుల నమోదు శరవేగంగా జరగాలి: కలెక్టర్

వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని న్యాల్​కల్​ మండంలంలో పర్యటించిన ఆయన ఆస్తుల నమోదు.. రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించారు.

Sangareddy Collector Inspection In nyalkal Mandal
న్యాల్​కల్​ మండలంలో పర్యటించిన కలెక్టర్

సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్​ మండలంలో కలెక్టర్​ హనుమంతరావు పర్యటించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి ఆస్తి వివరాలు అంతర్జాలంలో నమోదు చేయాలని సూచించారు. ఇంటర్నెట్​ సమస్య ఉందనే సాకుతో కాలయాపన చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.

న్యాల్​కల్​ మండలంలో పర్యటించిన కలెక్టర్

చిన్న చిన్న గ్రామాల్లో నమోదు పూర్తయితే.. ఖాళీగా ఉన్న ఆయా గ్రామాల కార్యదర్శులను వాడుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. ఇప్పటికే ఆస్తుల నమోదు ఆలస్యమైందని.. వీలైనంత వేగంగా పూర్తి చేసి.. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ఆయన రైతువేదిక నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి.. గడువు తేదీ కల్లా రైతువేదికలు సిద్ధం చేయాలన్నారు.

ఇవీ చూడండి: ‌గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details