సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు జాతీయ రహదారిపై లారీ కంటైనర్ను ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది.
లారీ కంటైనర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు జాతీయ రహదారిపై లారీ కంటైనర్ను.. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగిందని డిపో మేనేజర్ తెలిపారు.
పటాన్చెరు వద్ద లారీ కంటైనర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
నారాయణఖేడ్ డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ వెళుతుండగా.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ మలుపు తిప్పుతూ అకస్మాత్తుగా మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగిందని డిపో మేనేజర్ డి.ఎస్.ఆర్ మూర్తి తెలిపారు. బస్సులోని కొద్ది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు.