తెలంగాణ

telangana

ETV Bharat / state

అదుపు తప్పి స్కూలు వ్యాను​ బోల్తా.. 10 మందికి గాయాలు - సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి జిల్లా బసంత్​పూర్​లో ఓ ప్రైవేటు పాఠశాల వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించారు.

10 మందికి గాయాలు
అదుపు తప్పి స్కూలు వ్యాను​ బోల్తా

By

Published : Nov 26, 2019, 12:07 PM IST

అదుపు తప్పి స్కూలు వ్యాను​ బోల్తా.. 10 మందికి గాయాలు
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం బసంత్‌పూర్‌ వద్ద ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న మారుతి వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. చిన్నారుల తల్లిదండ్రులు వారిని బీదర్​, జహీరాబాద్​లోని ఆస్పత్రులకు తరలించారు.

మిర్జాపూర్‌(బి)లోని నవ భారత్‌ పాఠశాలకు కల్‌బేమల్‌, రాజోల గ్రామాల నుంచి 20 మంది విద్యార్థులతో వస్తున్న వ్యాను విద్యుత్‌ స్తంభాల కోసం తీసిన గుంతల్లో పడి అదుపు తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details