తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - ROAD_ACCIDENT in Sangareddy

సంగారెడ్డి జిల్లా సదాశివపేట శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

By

Published : Aug 14, 2019, 11:36 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆర్షద్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. సంగారెడ్డి నుంచి సదాశివపేట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆర్షద్, రాజుల వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్షద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు. మృతుడిది మెదక్ జిల్లా నర్సాపూర్ అని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి... తదుపరి విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details