తెలంగాణ

telangana

ETV Bharat / state

బాహ్యవలయంపై రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - Road Accident latest news

సంగారెడ్డి జిల్లా బాహ్యవలయ రహదారిపై ఆగిపోయిన లారీ టైరు మారుస్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి మరోలారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident at  Sulthanapur outer ring road in Sangareddy district
బాహ్యవలయంపై రోడ్డు ప్రమాదం.

By

Published : Jul 14, 2020, 1:26 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి రాజేంద్రనగర్‌కు కేబుల్ వైరు లోడు తీసుకెళ్తున్న లారీ సుల్తాన్​పుర్​ వద్ద టైరు పంచర్‌ అయింది. టైరు మారుస్తున్న లారీ క్లీనర్​ అమన్​కుమార్​, సయ్యద్​ సల్మాన్​లను వెనుకనుంచి మరో లారీ వచ్చి ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details