తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటి వద్దే మాల విరమణ చేయండి'

హనుమాన్ మాల దీక్షను భక్తులు తమ ఇంటి వద్దే తల్లితండ్రుల చేతుల మీదుగా మాల విరమణ చేయాలని దీక్ష రూపకర్త శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి ఆదేశించారు. లాక్​డౌన్ నిబంధనల వల్ల కండ్లకోయ వద్ద ఉన్న ఆశ్రమంలోనూ మాల విరమణ కార్యక్రమాలు లేవని ఆయన సంగారెడ్డిలో స్పష్టం చేశారు.

By

Published : May 17, 2020, 4:29 PM IST

Retire Hanuman Deeksha at home Due to Corona virus said by Sri Durga Prasad Swamy
'ఇంటి వద్దే మాల విరమణ చేయండి'

ఇవాళ హనుమాన్​ జయంతి సందర్భంగా దీక్ష చేపట్టిన భక్తులు ఇళ్ల వద్దే మాల విరమణ చేయాలని శ్రీ దుర్గా ప్రసాద్​ స్వామి తెలిపారు. కరోనా నివారణ, లోక కల్యాణం కోసం సంకల్పించిన కోటి హనుమాన్ చాలీసా పరిపూర్ణమైందని పేర్కొన్నారు. భారత్​లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రతి రోజు చాలీసా పారాయణం చేశారన్నారు. భక్తులందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details