తెలంగాణ

telangana

By

Published : May 29, 2019, 4:57 PM IST

ETV Bharat / state

ముస్లింలకు ప్రభుత్వం తరఫున రంజాన్​ కానుకలు

పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అర్హులైన ముస్లింలందరికీ రంజాన్ కానుకలు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రంజాన్​ కానుకలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో మసీదు కమిటీ ప్రతినిధులతో ఆర్డీవో అబ్దుల్ హమీద్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫున నియోజకవర్గానికి మంజూరైన రంజాన్ కానుకలను గురువారం పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్ మండలాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేందుకు లక్ష చొప్పున నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు.

రంజాన్​ కానుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details