సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో సంగారెడ్డి నుంచి పటాన్చెరు వైపు వస్తున్న ఆటోలో తనిఖీలు నిర్వహించగా అందులో 30 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని తెలిపారు.
పటాన్చెరులో 30 కిలోల గంజాయి స్వాధీనం - Polices Seized 30 Kgs Ganja at Patancheru latest news
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆటోలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
![పటాన్చెరులో 30 కిలోల గంజాయి స్వాధీనం Polices Seized 30 Kgs Ganja at Patancheru in Sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7704083-37-7704083-1592680535665.jpg)
పటాన్చెరులో 30 కిలోల గంజాయి స్వాధీనం
విట్టునాయక్ తండాకు చెందిన పాలియా టక్రూ, సుభాష్ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి వారిని రిమాండ్కు తరలించారు. వారికి సరఫరా చేసే ప్రధాన నిందితుడు బానోతు శ్రీను పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.