లాక్డౌన్తో సంగారెడ్డి జిల్లాలో భిక్షాటన చేసే వారు, అనాథలకు తినడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇది గమనించిన సంగారెడ్డి రూరల్ పోలీసులు అక్షయ పాత్ర సౌజన్యంతో పోతిరెడ్డిపల్లిలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఆకలితో అలమటించే వారికోసం పోలీసుల దాతృత్వం - తెలంగాణ వార్తలు
ఆకలితో అలమటించే వారి పట్ల సంగారెడ్డి రూరల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. లాక్డన్ వేళ భిక్షాటన చేసేవారు, అనాథల ఇబ్బందులు తెలుసుకున్న పోలీసులు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఆకలితో వచ్చే వారి కడుపు నింపుతున్నారు.
అన్నదానం కార్యక్రమం, సంగారెడ్డి పోలీసుల అన్నదానం
వాలంటరీలు ఎవరూ రాకపోవడంతో రూరల్ ఎస్సై సుభాష్ తమ సిబ్బందితో స్వయంగా భోజనం వడ్డించారు. ఆకలితో ఉన్న వారందరికీ భోజనం అందిస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రాణాన్ని బలిగొన్న.. ఫార్వర్డ్ సందేశం