తెలంగాణ

telangana

ETV Bharat / state

కట్టుదిట్టంగా అమలవుతోన్న లాక్​డౌన్​ - sangareddy lockdown

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో.. ఉదయం 10 గంటల నుంచి లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఉదయాన్నే ప్రజలు అధిక సంఖ్యలో బయటకు వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేసి తిరిగి వెళ్లిపోయారు. డీఎస్పీ శంకర్ రాజు పట్టణంలో లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలించారు.

sangareddy locvkdown
sangareddy locvkdown

By

Published : May 12, 2021, 1:52 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో లాక్​డౌన్​ ఆంక్షలను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు వ్యాపారాలకు అనుమతించిన పోలీసులు.. ఆ తర్వాత రాకపోకలను నిలిపివేశారు. డీఎస్పీ శంకర్ రాజు.. పట్టణంలో లాక్‌డౌన్‌ అమలవుతోన్న తీరును పరిశీలించారు.

తొలిరోజు ప్రధాన రహదారి సహా పట్టణ వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. వైద్యశాలలు, మందుల దుకాణాలు తెరిసే ఉండగా.. అత్యవసరం ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారు.

ఇదీ చదవండి:నర్సుల సేవలు, త్యాగం మరువలేనివి: సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details