తెలంగాణ

telangana

ETV Bharat / state

'సహకార సొసైటీల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి' - telangana news

జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లోనే రైతులు ఎరువులు కొనుగోలు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సూచించారు. పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు.

sangareddy district news, pesticides in sangareddy, pesticides in zahirabad
సంగారెడ్డి జిల్లా వార్తలు, సంగారెడ్డిలో ఎరువుల పంపిణీ, జహీరాబాద్​లో ఎరువుల పంపిణీ

By

Published : Jun 1, 2021, 2:19 PM IST

సకాలంలో ఎరువులు పంపిణీ చేయడంలో.. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కృషి చేస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. సొసైటీల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయిస్తున్నారని తెలిపారు. రైతులంతా ఈ సొసైటీల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు.

వ్యవసాయ సహకార సంఘాలకు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో అవసరమైనన్ని ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ఛైర్మన్ శివకుమార్ తెలిపారు. ఎరువుల గోదాం ప్రారంభం సందర్భంగా.. పలువురు రైతులకు యూరియా, డీఏపీ బస్తాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details